ముఖ్యమంత్రి కార్యాలయము తెలంగాణ ప్రభుత్వం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందించే సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిజాం సాగర్, సింగూరులో నీటి లభ్యత తక్కువగా ఉన్నందు వల్ల, ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది మంచినీరు అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సాగునీరు, తాగునీరు, పోడు భూముల సమస్యను ప్రజలతో చర్చించి, శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే నెలలో రెండు రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్ లో పర్యటించనున్నట్లు సిఎం వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ గురువారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఛాంబర్ లో సమావేశమయ్యారువేముల ప్రశాంత రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, ఎ.జీవన్ రెడ్డి, హనుమంతు షిండే, బియ్యాల గణేష్ గుప్తా, సురేందర్సుభాష్ రెడ్డి, సిఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్ప్రియాంక వర్గీస్, నీటి పారుదల శాఖ ఇఎన్సీ మురళీధర్ రావు, ఎస్ఇలు శంకర్, సుధాకర్ ఆర్.డబ్ల్యు.ఎస్. ఇవన్సీ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీని లింక్ చేసినందు వల్ల భవిష్యత్తులో ఎస్సారెస్పీ ఆయకట్టుకు ధోకా ఉండదని సీఎం అన్నారు. గుత్ప, అలీసాగర్ ల మాదిరిగానే లిఫ్టులు పెట్టి బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజవర్గాలకు సాగునీరు అందివ్వాలని సీఎం చెప్పారు. దీనికోసం తక్షణం సర్వే జరిపి, లిప్టులు ఎక్కడ పెట్టి, ఏఏ గ్రామల పరిధిలో ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చో తేల్చాలని నీటి పారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతీ ఏటా Page